యాప్నగరం

ముద్రగడ మాటలు బాధించాయి: అంబటి

తెలుగుదేశం ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధించినప్పుడు తాము అండగా నిలిచామని,

Samayam Telugu 30 Jul 2018, 8:39 pm
తెలుగుదేశం ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధించినప్పుడు తాము అండగా నిలిచామని, అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు. కాపు రిజర్వేషన్ల విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యల అనంతర పరిణామాల్లో ముద్రగడ స్పందిస్తూ జగన్ మోహన్ రెడ్డికి తమ జాతి అంటే చిన్నచూపు అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాపు రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉందని, ఆ విషయంలో తను మోసం చేసే హామీని ఇవ్వలేను అని జగన్ వ్యాఖ్యానించిన అనంతరం ముద్రగడ స్పందించారు.
Samayam Telugu ambati


ఈ నేపథ్యంలో స్పందిస్తూ... ముద్రగడ వ్యాఖ్యలు బాధకరం అని అంబటి వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో హామీగా ఇచ్చారని, అయితే ఆ హామీ అమలు మాత్రం కాలేదని అంబటి గుర్తు చేశారు. అసలు ఆ వ్యవహారాన్నే చంద్రబాబు పట్టించుకోలేదని, ముద్రగడ పద్మనాభం పోరాటం మొదలయ్యాకే చంద్రబాబు స్పందించారన్నారు. తుని ఘటన అనంతర పరిణామాల్లో ముద్రగడకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందన్నారు. తామంతా ఆ పోరాటంలో పాల్గొన్నామన్నారు.

తుని ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ వంటి వారిపై కూడా కేసులు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోందని, అయినా తాము ముద్రగడకు సంఘీభావంగా తెలుపుతూ వచ్చామన్నారు. తాము కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, అయితే ఆ అంశం కేంద్ర పరిధిలో ఉందని, చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపి రిజర్వేషన్లను అమలు చేయాల్సిందని, అయితే బాబు మోసం చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.