యాప్నగరం

అమిత్ షా జవాబు చెప్పకుండానే వెళ్లిపోయారు

ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్

Samayam Telugu 25 May 2017, 8:09 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు బీజేపీ నేతలు సైతం సమాధానాలు చెప్పలేకపోయారన్నారు. గురువారం హరీష్ రావు ఇతర నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
Samayam Telugu amit sha left telangana without giving answer says harish rao
అమిత్ షా జవాబు చెప్పకుండానే వెళ్లిపోయారు


పోరాటాల గడ్డ అయిన తెలంగాణలో అడుగుపెట్టి ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని హరీష్ రావు బీజేపీ నేతలను హెచ్చరించారు. హైకోర్టును విభజించి తెలంగాణపై ఉన్న ప్రేమను బీజేపీ నేతలు నిరూపించుకోవాలని సూచించారు.

రూ.లక్ష కోట్లు ఇచ్చామన్నది వాస్తవం కాదని పరోక్షంగా బీజేపీ నేతలు కూడా అంగీకరించారని చెప్పిన హరీష్... పన్నులరూపంలో కేంద్రానికి తెలంగాణ ఇస్తున్నది రూ.50 వేల కోట్లు అని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి వస్తున్నది కేవలం రూ.24 వేల కోట్లు మాత్రమేనన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.