యాప్నగరం

నాటుకోడి వేపుడుతో అమిత్‌షాకు విందు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఘనమైన విందు ఇచ్చారు.

Samayam Telugu 25 May 2017, 4:19 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఘనమైన విందు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గురువారం షా విజయవాడలో బాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు తెలుగు వంటకాలతో అమిత్ షాకు విందు ఇచ్చారు.
Samayam Telugu amit shah given natu kodi vepudu party by chandrababu naidu
నాటుకోడి వేపుడుతో అమిత్‌షాకు విందు


నాటుకోడి వేపుడు, పనసకాయ బిర్యానీ, గుంటూరు గొంగూర, ఆవకాయ పచ్చడి, ఉలవచారు, పచ్చి వెన్న, చేపల పులుసు, గారెలు, గుమ్మడి కాయ ఒడియాలు, పూతరేకులు, బూరెలు, బొబ్బట్లు, బందరు లడ్డూలతో సహా వివిధ శాఖాహార కూరలతో అమిత్ షాకు విందు ఇచ్చారు. దాదాపు గంటపాట ఈ విందు భేటీ జరిగింది.

ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, రాష్ట్రపతి ఎన్నిక, ఇరు పార్టీల బలోపేతాలపై చర్చించినట్లు సమాచారం. ఈ విందు భేటీలో కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, వెంకయ్యనాయుడు, సుజానా చౌదరి, రాష్ట్రమంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, కళావెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.