యాప్నగరం

ఢిల్లీ రండి... ఏపీ బీజేపీ నేతలకు షా పిలుపు

ఏపీ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే హస్తినకు రావాలంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు. సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలతో షా సమావేశమవుతారని తెలుస్తోంది.

Samayam Telugu 17 Mar 2018, 9:46 am
ఏపీ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే హస్తినకు రావాలంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు. సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలతో షా సమావేశమవుతారని తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులతో పాటూ మరికొందరు నేతలకు పిలుపు వచ్చినట్లు సమాచారం. వీరంతా మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటారు.
Samayam Telugu amit shah to meet ap bjp leaders today
ఢిల్లీ రండి... ఏపీ బీజేపీ నేతలకు షా పిలుపు


ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం... కేంద్రంపై వైసీపీ, టీడీపీల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో... తదనంతర పరిణామాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంల పరిస్థితులు, తాజా రాజకీయాలు చర్చకు రానున్నాయి. భవిష్యత్‌లో పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి... ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపైనా అమిత్ షా నేతలకు దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.