యాప్నగరం

కూతురు కంటే పరువే ముఖ్యం: అమృత తండ్రి

కూతురు జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రణయ్‌ వినిపించుకోలేదని, అతణ్ని చంపించినందుకు ఎలాంటి బాధలేదని మారుతీరావు అన్నాడు.

Samayam Telugu 15 Sep 2018, 11:58 pm
జైలుకు వెళ్లేందుకు సిద్ధపడే ప్రణయ్‌ను హత్య చేయించానని అమృత తండ్రి మారుతీరావు తెలిపాడు. తన కూతురు కంటే సొసైటీలో పరువే ముఖ్యమని భావించానని చెప్పినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు శనివారం (సెప్టెంబర్ 15) వీరిని విడివిడిగా విచారించారు. విచారణలో ఏ1 నిందితుడు అమృత వర్షిణి తండ్రి మారుతీరావు సంచలన విషయాలు తెలిపాడు.
Samayam Telugu maruthi


‘అమృత, ప్రణయ్‌ ప్రేమ వ్యవహారం పదో తరగతిలోనే తెలుసు. నా కూతురు జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రణయ్‌ వినిపించుకోలేదు. మా మాటల్ని లెక్కచేయకుండా పెళ్లి చేసుకున్నాడు. అతణ్ని చంపించినందుకు నాకు ఎలాంటి బాధలేదు. నా కూతురు కంటే సమాజంలో పరువే ముఖ్యమని భావించా. జైలుకు వెళ్లేందుకు సిద్ధపడే హత్య చేయించా’ అని మారుతీరావు చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రణయ్‌ను హత్య చేసేందుకు రూ.10 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మారుతీరావు తెలిపాడు. రూ. 5 లక్షల అడ్వాన్స్‌ కూడా చెల్లించినట్లు చెప్పాడు. తన కూతురికి ఎలాంటి హానీ జరగొద్దని వారికి సూచించినట్లు తెలిపాడు. కూతురిపై ప్రేమతోనే ఇలా చేసినట్లు వెల్లడించాడు. ప్రణయ్‌ కోసం సుఫారీ గ్యాంగ్‌ 2 నెలలుగా రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
చదవండి: ప్రణయ్ ప్రేమకు గుర్తుగా బేబీని పెంచుకుంటా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.