యాప్నగరం

టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి.. మరో నేత?

ఏపీలో రాజకీయ వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగగా, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు

Samayam Telugu 17 Apr 2018, 1:02 pm
ఏపీలో రాజకీయ వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగగా, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు సాగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే గుంటూరు, విజయవాడల్లో జగన్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ నుంచి నేతలు వైసీపీలోకి చేరారు. జగన్ తో పార్టీ కండువాలు వేయించుకుని వీళ్లు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో నేత కూడా వైఎస్సార్సీపీ బాటపడుతున్నాడని తెలుస్తోంది.
Samayam Telugu anam


ఆయన మరెవరో కాదు.. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో గతంలో కీలకంగా వ్యవహరించి, గత ఎన్నికల అనంతరం రామనారాయణ రెడ్డి తన సోదరుడు వివేకానందరెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ తరఫున వీరికి ఎమ్మెల్సీ హామీ లభించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అది జరగలేదు. ఒక దశలో రామనారాయణరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవిని ఇవ్వనున్నారనే మాట కూడా వినిపించింది.

అయితే అది కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామనారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో చర్చలు జరుగుతున్నాయని.. వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రామనారాయణ రెడ్డిని పోటీ చేయించాలని వైఎస్సార్సీపీ భావిస్తోందని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే ఆనం వివేకానందరెడ్డిని పరామర్శించడానికి వెళ్లినప్పుడు కూడా అక్కడ నుంచి రామనారాయణ రెడ్డి వెళ్లిపోయారని, తన కార్యాలయం నుంచి కూడా చంద్రబాబు ఫొటోలను ఆయన తీసేయించారని... వైసీపీలోకి ఈయన చేరిపోవడం ఇక లాంఛనమే అని ప్రచారం సాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.