యాప్నగరం

వైసీపీ గూటికి ఆనం విజయ్‌కుమార్ రెడ్డి

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం విజయ్ కుమార్ జగన్ సమక్షంలో బుధవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

TNN 23 Mar 2016, 3:13 pm
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం విజయ కుమార్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండ్ లో ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో బుధవారం ఆయన వైసీపీ కండవా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి సహా జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆనం విజయకుమార్ వైసీసీలో చేరికతో కాంగ్రెస్ తో ఆనం కుంటుంబ సభ్యులకు ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లయింది. ఇటీవలికాలంలో ఆనం రాంనారాయణరెడ్డి, వివేకానందరెడ్డిలు టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆనం విజయకుమార్ గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
Samayam Telugu anam vijay kumar join in ysr congress
వైసీపీ గూటికి ఆనం విజయ్‌కుమార్ రెడ్డి


ఆనం విజయకుమార్ పార్టీలో చేరిన నేపథ్యంలో జగన్ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనం విజయకుమార్ చేరికతో నెల్లూరు జిల్లాలో వైసీపీ మరింత బలోపేతమతుందన్నారు. టీడీపీ నుంచి వెళ్లిన 8 మంది ఎమ్మెల్యేలు లేని లోటు ఆనం విజయ్ తీర్చేశారని వెల్లడించారు. డబ్బలిచ్చి ప్రలోభాలను గురి చేసిన చంద్రబాబు నీచ రాజకీయాలు ఎంతో కాలం సాగవని వైసీపీ అధినేత జగన్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.