యాప్నగరం

ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ ప్రమాదంపై దద్ధరిల్లిన ఏపీ అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చివరి రోజు సమావేశాలు నిరసనల పర్వంతోనే మొదలయ్యాయి. ఆనంద్ ఆక్వా ..

Samayam Telugu 31 Mar 2017, 11:20 am
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చివరి రోజు సమావేశాలు నిరసనల పర్వంతోనే మొదలయ్యాయి. నిరసనలతోనే ముందుకు సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని ఆనంద్ ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో ప్రమాదం కారణంగా ఐదుగురు మృత్యువాత పడటం బాధాకరం అని ఆందోళన వ్యక్తంచేసిన ప్రతిపక్షం ఈ దుర్ఘటనపై చర్చ చేపట్టాలని పట్టుబట్టింది. అయితే, సభ సంస్కృతికి విరుద్ధంగా క్వశ్చన్ హవర్ పూర్తి కాకుండా చర్చ చేపట్టడం సాధ్యపడదు అని స్పీకర్ కోడెల శివప్రసాద రావు ప్రతిపక్ష సభ్యులకి తేల్చిచెప్పారు.
Samayam Telugu anand aqua food factory issue halts andhra pradesh assembly sessions last day
ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ ప్రమాదంపై దద్ధరిల్లిన ఏపీ అసెంబ్లీ


దీంతో నిరసనకి దిగిన వైఎస్సార్సీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి స్పీకర్ చుట్టూ చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓవైపు ఆనంద్ ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీలో నిర్లక్ష్యం కారణంగా ఐదుగురు కార్మికులు చనిపోతే, ప్రభుత్వం మాత్రం కార్మికులకి న్యాయం చేయకుండా పరిశ్రమ యాజమాన్యానికి మద్దతు తెలపడం ఏంటో అర్ధం కావడం లేదని విచారం వ్యక్తంచేశారు ప్రతిపక్ష సభ్యులు.

సమావేశాలకి ఈరోజే చివరి రోజైనందున మొగల్తూరు బాధితులకి న్యాయం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటో వివరణ ఇస్తూ వాయిదా తీర్మానం చేపట్టాలని ప్రతిపక్షం పట్టుపట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.