యాప్నగరం

అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభం

అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీకి మోక్షం కలిగింది. జేఎన్టీయూ క్యాంపస్‌లోని ఐటీ ఇంకుబేషన్ భవనంలో తాత్కాలికంగా వర్సిటీని ఏర్పాటు చేయగా.. ఇవాళ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా తరగతులు ప్రారంభమయ్యాయి.

Samayam Telugu 5 Aug 2018, 5:58 pm
అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీకి మోక్షం కలిగింది. జేఎన్టీయూ క్యాంపస్‌లోని ఐటీ ఇంకుబేషన్ భవనంలో తాత్కాలికంగా వర్సిటీని ఏర్పాటు చేయగా.. ఇవాళ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీతతో పాటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. క్లాసులు ప్రారంభించాక జవదేకర్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సమయంలో కేంద్రమంత్రికి ప్రత్యేక హోదా సెగ కూడా తగిలినట్లు తెలుస్తోంది. విద్యార్థులు పదే, పదే హోదాకు సంబంధించిన అంశాలపై ప్రశ్నల వర్షం కురిపంచారట.
Samayam Telugu Central University


విద్యార్థులతో ముఖాముఖి తర్వాత జవదేకర్ మాట్లాడారు. ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటోందని.. ఏపీకి కేటాయించిన యూనివర్సిటీలకు నిధులు కేటాయించామన్నారు. అయినా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. సెంట్రల్ యూనివర్శిటీకి కూడా తొలిదశలో 460 నిధులు కేటాయించామని.. రెండో దశలో మరో రూ.500 కోట్లు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో విద్యకోసం రూ.3600కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. త్వరలో సెంట్రల్‌ వర్సిటీ భవనాలకు శంకుస్థాపనలు చేస్తామన్నారు.

మరోవైపు జవదేకర్‌ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కౌంటరిచ్చారు. కేంద్రమంత్రి చెప్పినవననీ అవాస్తవాలని.. కేంద్రం ఏర్పాటు చేస్తామన్న యూనివర్సిటీలన్నీ కేవలం భూమిపూజకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు. కేంద్రం చెప్పిన నిధుల్లో కూడా 10 శాతం మాత్రమే ఇచ్చారని.. 7 యూనవర్సిటీలకు 3,508 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందన్నారు. యూనివర్సిటీలకు ఇచ్చిన నిధులపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.