యాప్నగరం

పోలీస్ వ్యవస్థను కించపరిస్తే నాలుక కోస్తాం.. నేతలు బీ కేర్‌ఫుల్: పోలీసు అధికారుల సంఘం

రాజకీయ నేతలకు కొమ్ము కాయడానికి పోలీసు వృత్తిలోకి రాలేదు.. మగాళ్లమయ్యే పోలీసు ఉద్యోగం చేస్తున్నాం.. నోరు అదుపులో పెట్టుకోండి

Samayam Telugu 20 Sep 2018, 9:30 pm
రాజకీయ నేతలెవరైనా పోలీస్ వ్యవస్థని కించపరిస్తే నాలుక కోస్తామంటోంది ఏపీ పోలీసు అధికారుల సంఘం. తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమ వివాద సమయంలో.. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సంఘం నేతలు మండిపడ్డారు. ఎంపీ వ్యాఖ్యలు పోలీసుల్ని కించపరిచేలా ఉన్నాయని.. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్. పోలీస్ ఉనికికే ప్రమాదం తెచ్చేలా రాజకీయ నేతలు వ్యవహరిస్తున్నారని.. ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా అదుపుతప్పి మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు.
Samayam Telugu Jc Diwakar


రాజకీయ నేతల్లా అసభ్య పదజాలంతో తామూ మాట్లాడగలమన్నారు మాధవ్. రూలింగ్‌లో ఉన్నవాళ్లు.. లేనివాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వారికి కొమ్ము కాయడానికి పోలీసులు వృత్తిలోకి రాలేదని గుర్తు పెట్టుకోవాలన్నారు. మగాళ్లమయ్యే పోలీసు ఉద్యోగం చేస్తున్నామని.. శిఖండిలం కాదన్నారు. నేతల మాటలతో భార్యాబిడ్డలకు మొహాలు చూపించలేకపోతున్నామని.. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎలా పనిచేస్తున్నారో గమనిస్తే మంచిదన్నారు. ఊరుకుంటే హద్దు మీరుతున్నారని.. ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమ వివాద సమయంలో.. ఎంపీ జేసీ పోలీసు అధికారులే టార్గెట్‌గా విమర్శలు చేశారు. తమ అనుచరులపై దాడులు జరుగుతుంటనే అడ్డుకోకుండా పోలీసులు పారిపోయారని.. పోలీసుల్లో మగాళ్లు లేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసు అధికారుల సంఘం ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.