యాప్నగరం

ఆర్టీసీ బస్సులో ప్రసవించిన అనంతపురం మహిళ

ఆర్టీసీ బస్సులోనే ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. రాయదుర్గం పట్టణానికి చెందిన అరుణ.. వైద్య పరీక్షల కోసం భర్తతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ పండంటి పాపాయికి జన్మనిచ్చింది.

TNN 9 Dec 2017, 6:53 pm
ఆర్టీసీ బస్సులోనే ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. రాయదుర్గం పట్టణానికి చెందిన అరుణ.. వైద్య పరీక్షల కోసం భర్తతో కలిసి ఆర్టీసీ బస్సులో కర్ణాటకలోని బళ్లారికి బయల్దేరింది. బస్సు బాదన్‌హళ్‌ గ్రామ సమీపానికి చేరుకోగానే అరుణకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. బస్సు డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా స్పందించి బస్సును గ్రామంలోకి తీసుకెళ్లి ఓ చోట ఆపేశారు. దీంతో గ్రామానికి చెందిన కొంత మంది మహిళలు అరుణకు బస్సులోనే పురుడుపోశారు.
Samayam Telugu anantapur women delivers a baby in rtc bus
ఆర్టీసీ బస్సులో ప్రసవించిన అనంతపురం మహిళ


అరుణ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ను అందరూ అభినందించారు. ఇటీవల ఓ మహిళ వెళుతూ వెళుతూ రోడ్డు మీదే ప్రసవించిన సంగతి తెలిసిందే. నెలలు నిండిన మహిళల విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుందని ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.