యాప్నగరం

అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ: మోదీతో చంద్రబాబు

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ భారీ మూల్యం చెల్లిస్తుంటే.. తెలంగాణకు పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతోందని సీఎం పేర్కొన్నారు. 58% జనాభా ఉన్న రాష్ట్రానికి 46% ఆదాయాన్ని మాత్రమే కేటాయించారని తెలిపారు.

TNN 13 Jan 2018, 10:13 am
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన వల్ల తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి చేకూరితే.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం భారీగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న ఆయన దాదాపు 40 నిమిషాలు పాటు ఏపీ సమస్యలను విన్నవించారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న కష్టాలు, చేపట్టాల్సిన చర్యలపై 13 అభ్యర్థనలతో 17 పేజీల వినతి పత్రాన్ని మోదీకి అందించారు. ఈ సందర్భంగా ప్రధానికి బొబ్బిలి వీణ, డైరీ, తిరుపతి లడ్డూ బహూకరించారు.
Samayam Telugu andhra cm n chandrababu naidu meets pm narendra modi with a list of 13 wishes
అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ: మోదీతో చంద్రబాబు


ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంచడం వల్ల రాజకీయ సుస్థిరత వస్తుందని ప్రధానికి తెలిపారు. అంతకంటే ముందుగా ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. అసంబద్ధమైన విభజన వల్ల ఏపీ ఆర్థికంగా రెక్కలు తెగిన పక్షిలా తయారైందని మోదీకి చెప్పినట్లు సీఎం విలేకరుల సమావేశంలో తెలిపారు. విభజన సమయంలో రూ.33వేల కోట్ల అదనపు అప్పుల భారాన్ని ఏపీపై రుద్దారని తెలిపారు.

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ భారీ మూల్యం చెల్లిస్తుంటే.. తెలంగాణకు పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతోందని సీఎం పేర్కొన్నారు. 58% జనాభా ఉన్న రాష్ట్రానికి 46% ఆదాయాన్ని మాత్రమే కేటాయించారని, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులతోపాటు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు కట్టుబడి నడుచుకోవడం కష్టంగా మారిందన్నారు. ఏపీ తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా.. ఎఫ్‌ఆర్‌బీఎం కింద రుణపరిమితిని పెంచలేదని తెలిపారు. అయితే, తెలంగాణకు మాత్రం ఆ వెసులుబాటు కల్పించాలన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక లోటును ఎదుర్కొనేందుకు ముందుగా రూ.17,000 కోట్లను ఏదో ఒక రూపంలో ఇవ్వాలని కోరినట్లు సీఎం చెప్పారు. తమ డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.