యాప్నగరం

తిత్లీ బీభత్సం: రూ.1200 కోట్లతో ఆదుకోండి ప్రధానికి సీఎం లేఖ

తిత్లీ తుఫాన్‌తో భారీగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాశారు. మరి, కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Samayam Telugu 13 Oct 2018, 2:28 pm
త్తరాంధ్రలో పెను విధ్వంసం సృష్టించిన తిత్లీ తుఫాన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం లేఖ రాశారు. తుఫాన్ దాటికి శ్రీకాకుళం జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. కేంద్రం కూడా తనవంతుగా సాయం చేయాలని కోరారు.
Samayam Telugu Untitled123


ప్రాథమిక అంచనా ప్రకారం తుపాన్ వల్ల రూ.2800 కోట్లు వరకు నష్టం వాటిల్లిందని లేఖలో తెలిపారు. కేంద్ర తక్షణ సాయం కింద రూ.1200 కోట్లు విడుదల చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన తోటలకు రూ.1800 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.500 కోట్లు, పంచాయితీ రాజ్, పశుసంవర్ధక శాఖ, గ్రామీణ నీటి సరఫరా, జలవనరుల శాఖలకు రూ.100 కోట్లు చొప్పున నష్టం వాటిల్లిందని సీఎం వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.