యాప్నగరం

కేరళకు బాసటగా ఏపీ ఐఏఎస్ అధికారులు

కేరళ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఆంధ్ర ప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సంఘం ముందుకొచ్చింది.

Samayam Telugu 20 Aug 2018, 1:50 pm
కేరళ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఆంధ్ర ప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సంఘం ముందుకొచ్చింది. కేరళ పునర్నిర్మాణం కోసం సభ్యులంతా సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఒక్క రోజు వేతనాన్ని విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. కేరళ కోసం ఒక్క రోజు జీతాన్ని విరాళంగా ఇస్తున్న ఏపీ ఐఏఎస్ ఆఫీసర్ల అసోషియేషన్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ తెలిపారు. వరద బారిన పడిన ప్రజలను ఆదుకోవడం, పునరావాసం కోసం సైన్యం, సాధారణ ప్రజానీకం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
Samayam Telugu 14


ఇప్పటికే కేరళకు ఏపీ సర్కారు రూ.10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేరళ సీఎం పినరయి విజయన్‌తో చంద్రబాబు ఫోన్ల మాట్లాడారు. అన్నివిధాలుగా కేరళను ఆదుకుంటామని ఈ సందర్భంగా ఏపీ సీఎం హామీ ఇచ్చారు. ఏపీ సర్కారు స్పెషల్ రెస్క్యూ టీంను కూడా కేరళ పంపించింది.

కేరళను పదిరోజులకు పైగా కుదిపేసిన వర్షాలు సోమవారం నుంచి తగ్గుముఖం పట్టాయి. అక్కడి పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.