యాప్నగరం

ఆయేషా మీరా హత్య కేసు రీ ఓపెన్?

ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా సత్యంబాబు విడుదలయ్యాడు.

TNN 13 Apr 2017, 1:53 pm
ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా సత్యంబాబు విడుదలయ్యాడు. సత్యంబాబుకు ఆ హత్యకు అస్సలు సంబంధం లేదని తెలుగు రాష్ట్రాల హైకోర్టు చాలా గట్టిగా చెప్పింది. అన్యాయంగా అతడిని అరెస్టు చేశారంటూ పోలీసులకు చీవాట్లు కూడా పెట్టింది. దీంతో అసలు హంతకులు ఎవరన్న దానిపై విజయవాడలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓ అమ్మాయిని అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనేదే అందరి సందేహం. అప్పట్లో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడి పాత్రపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అలాగే ఆయేషా తల్లిదండ్రులు కూడా హాస్టల్ వార్డెన్, కోనేరు మనవడు, హాస్టల్ అమ్మాయిలైనా కవిత, సౌమ్య లపై అనుమానం వ్యక్తం చేశారు. వారే తమ కూతురిని చంపేశారని ఆరోపించారు. అయినా వాళ్లని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. సత్యం బాబును ఇరికించి అసలు ముద్దాయిలను తప్పించారని కూడా విమర్శులు వచ్చాయి. ఎనిమిదేళ్లు జైల్లో ఉన్నాక సత్యం బాబు నిర్దోషిగా బయటికి వచ్చాడు. ఇటీవల సత్యం బాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇల్లు, ఉపాధి కల్పిస్తానని మాటిచ్చారు.
Samayam Telugu andhra likely to reopen ayesha meera case
ఆయేషా మీరా హత్య కేసు రీ ఓపెన్?


కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ఆ కేసును రీ ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కేసు రీ ఓపెన్ విషయమై ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు చంద్రబాబుతో మాట్లాడారు. సత్యం బాబుపై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని పరిశీలించి, న్యాయ నిపుణుల సలహా మేరకు చర్యలు చేసుకోవాలని భావిస్తున్నట్టు వారు సీఎంకు తెలిపారు. కాగా ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాలా? లేక తిరిగి కేసును పున: పరిశోధన చేయాలా అన్నది ఆలోచిస్తున్నారు. రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. చంద్రబాబు న్యాయనిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లమని డీజీపీని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.