యాప్నగరం

ఏపీ: 13 కాదు, 25 జిల్లాలు.. త్వరలోనే కసరత్తు

రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి.. త్వరలో 25 జిల్లాలు కాబోతున్నాయని విజయసాయి చెప్పారు. శాశ్వత కార్యాలయం కోసం స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామని.. కొత్త వాటితో కలిపి 25 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తామన్నారు.

Samayam Telugu 13 Jun 2019, 5:03 pm
పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అవినీతి రహిత పాలనతో ముఖ్యమంత్రి జగన్ ప్రజల కోసం పనిచేస్తారని.. అదే సమయంలో పార్టీకి కొంత సమయాన్ని కేటాయిస్తారన్నారు. గురువారం జరిగిన వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు.
Samayam Telugu ap


రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి.. త్వరలో 25 జిల్లాలు కాబోతున్నాయని విజయసాయి చెప్పారు. శాశ్వత కార్యాలయం కోసం స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామని.. కొత్త వాటితో కలిపి 25 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో హైదరాబాద్‌ నుంచి తాడేపల్లికి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తరలిస్తామని.. శని, ఆదివారాల్లో పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

పార్టీ కార్యక్రమాలు తగ్గిపోయాయనే వాదన వినిపిస్తోందని.. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలను ముమ్మరం చేస్తామన్నారు ఎంపీ. వైసీపీ కార్యకర్తలు కూడా ప్రజలకు సేవచేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించి తిరిగి 2024లో అధికారంలోకి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు విజయసాయి. గ్రామ వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేయాలకునేవారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీని కోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.