యాప్నగరం

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ.. జగన్, బాబు ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో తొలిసారిగా శాసనసభ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10.50 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు.

Samayam Telugu 12 Jun 2019, 11:32 am
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో తొలిసారిగా శాసనసభ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10.50 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం 11.05 గంటలకు శాసనసభలోకి జగన్ ప్రవేశించారు. అనంతరం సభా కార్యక్రమాలను ప్రొటెం స్పీకర్ శంబంగి చిన్నప్పలనాయుడు ప్రారంభించారు. తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.ముఖ్యమంత్రిగా దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడితో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, మిగతా సభ్యులు అక్షర క్రమంలో ప్రమాణస్వీకారం చేస్తున్నారు.
Samayam Telugu jagan2


సభ్యుల ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక గురువారం జరగుతుంది. శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. జూన్ 15, 16 తేదీలు సెలవు కావడంతో మళ్లీ 17, 18 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈ రెండు రోజులు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. తిరిగి జులైలో బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనున్నారు. గత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ ఛాంబర్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, గతంలో లోకేష్‌ కార్యాలయాన్ని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయానికి కేటాయించారు. అలాగే గత సభలో వైసీపీ శాసనసభ పక్ష కార్యాలయం, టీడీపీ శాసనసభ పక్ష కార్యాలయం, ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌కు కేటాయించిన ఛాంబర్‌లను ప్రస్తుతం వైసీపీ తీసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.