యాప్నగరం

ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షా.. అనబోయేది రేపే

రాష్ట్ర విభజన తర్వాత శాసనసభ సమావేశాలు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలిసారి జరగనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది.

TNN 5 Mar 2017, 8:09 am
రాష్ట్ర విభజన తర్వాత శాసనసభ సమావేశాలు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలిసారి జరగనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి మొదలవుతుండగా.. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన భవనంలో శాసనసభ, మండలి కొలువుదీరనున్నాయి.
Samayam Telugu andhra pradesh assemblybudget session of ap assembly
ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షా.. అనబోయేది రేపే


సోమవారం ఉదయం 11.06 గంటలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన అనంతరం శాసనసభ ప్రారంభం కానుంది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు శాసనసభ, మండలి సమావేశాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే జరిగాయి. అయితే యుద్ధ ప్రాతిపదికన వెలగపూడిలో శాసనసభ నిర్మించడంతో తదుపరి సమావేశాలు అమరావతిలోనే జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగానే 192 రోజుల్లోనే శాసనసభ భవనాన్ని సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక శాసనసభను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు.

1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం తర్వాత శాసనసభ హైదరాబాద్‌లో ఏర్పాటవ్వగా... తొలి సభాపతిగా కృష్ణా జిల్లాకు చెందిన అయ్యదేవర కాళేశ్వరరావు వ్యవహరించగా.. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్‌గా కోడెల శివప్రసాద్‌‌రావు వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టంగా చెప్పవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.