యాప్నగరం

బంద్ ప్రభావంతో ఏపీలో స్తంభించిన జనజీవనం

బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం నిరసిస్తూ, వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌లు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

TNN 8 Feb 2018, 9:04 am
బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌లు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గురువారం తెల్లవారుజాము నుంచే విద్యార్థులు, నేతలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు ఆరంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని అన్ని డిపోల ఎదుటా సీపీఐ, సీపీఎం, వైసీపీ నేతలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రహదారులకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపి ప్రైవేటు వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపేస్తుండటంతో జనజీవనం స్తంభించింది.
Samayam Telugu andhra pradesh bandh what services will be hit and what will stay open
బంద్ ప్రభావంతో ఏపీలో స్తంభించిన జనజీవనం


అనేక ప్రాంతాల్లో వ్యాపార సంస్థలను స్వచ్చదంగానే వ్యాపారులు మూసివేయగా, ప్రజలు కూడా బంద్‌లో పాల్గొంటున్నారు. అత్యవసర సేవల వాహనాలు మినహా మిగతావి రహదారులపై కనిపించడం లేదు. మరోవైపు విశాఖ నగరంలోని మద్దెలపాలెం డిపో వద్ద ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విశాఖ జిల్లా వ్యాప్తంగా 695 బస్సులు నిలిచిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా ఏజన్సీ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. శ్రీకాకుళం, కడప, విజయవాడ ప్రాంతాల్లో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వామపక్షాలు భారీ ర్యాలీని నిర్వహించాయి.

డిపోల నుంచి బస్సులను బయటకు కదలనీయలేదు. ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో డ్రోన్‌లను ఉపయోగించి పోలీసులు పహారా కాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రయివేట్ విద్యాలయాలు సైతం స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అధికార పార్టీ సైతం మండల, జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడుతూ బంద్‌కు పరోక్షంగా టీడీపీ మద్దతు తెలిపింది. ఏపీకి జరిగిన అన్యాయంపై శాంతియుత నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్‌లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. పార్లమెంట్‌లో ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నినాదాలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.