యాప్నగరం

చదువుతో తెలివి... సంస్కారంతో భవిష్యత్తు

ఏటా ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు అందజేసే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నిర్వహించారు.

TNN 15 Oct 2017, 4:47 pm
పిల్లలకు ఎంత సంస్కారం నేర్పిస్తామనేది ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఏటా ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు అందజేసే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. చంద్రబాబు మాట్లాడుతూ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టినరోజున ప్రతిభా పురస్కారాలను ఇవ్వడం సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి తాను శ్రీకారం చుట్టానని బాబు పేర్కొన్నారు.
Samayam Telugu andhra pradesh cm chandrababu naidu comments about education and culture
చదువుతో తెలివి... సంస్కారంతో భవిష్యత్తు


రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీకే ప్రాధాన్యత ఉంటుందని, ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పడం లేదు..ఇరవై ఏళ్లుగా చెబుతున్నానని అన్నారు. మన పిల్లలకు మనం ఎన్ని ఆస్తులు ఇస్తాం, ఎంత భూమి ఇస్తామనేది ముఖ్యం కాదు. వారిని ఎంత బాగా చదివిస్తాం, ఎంత మంచి సంస్కారం నేర్పిస్తాం అనేది ముఖ్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చదువు.. తెలివినిస్తుంది, ఏదైనాసరే, సాధించే శక్తినిస్తుంది... అదే సమయంలో, సంస్కారం భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ రోజున మనం ఆనందంగా ఉండాలంటే డబ్బు ఎంత ముఖ్యమో, మన సంప్రదాయాలను, కుటుంబ వ్యవస్థలను, అదే మాదిరిగా మనకున్న విలువలను మనం కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యమని వివరించారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలని, ఈ విషయంలో పిల్లల కంటే వారే ఎక్కువ కష్టపడుతున్నారని కొనియాడారు.

1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు చదువుకు ప్రాధాన్యత ఇచ్చి, ఓ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల, ప్రతి మండలానికి జూనియర్ కళాశాల, అదే విధంగా రెవెన్యూ డివిజన్‌కు ఒక ఇంజనీరింగ్ కళాశాల, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలని ప్రయత్నం చేశానని ఏపీ సీఎం తెలియజేశారు. కాలేజీలు పెడితే లాభం లేదు, అందరికీ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఐటీ కంపెనీలను ప్రమోట్ చేశాను. ఐటీ కంపెనీలు ప్రమోట్ చేసిన తర్వాత మనవాళ్లు వేరే దేశాలకు వెళ్లారు. ప్రపంచంలో 25 శాతం ఐటీ ఇంజనీర్లు మన వాళ్లు ఉన్నారంటే దానికి కారణం ఆ రోజున వేసిన బీజమే. అదే సమయంలో ఉద్యోగాలతో తృప్తిపడకుండా..పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆరోజున ఆలోచించి, ఓ సందేశం ఇచ్చానని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.