ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. వచ్చే నెలలో ఆయన తన కుటుంబంతో కలిసి యూఎస్ టూర్కు వెళ్లనున్నారు. ఆగస్టు 17 నుంచి 23 వరకు జగన్ పర్యటన ఉంటుందట. మిషిగన్- డెట్రాయిట్ -కోబో కన్వెన్షన్ సెంటర్లో ప్రవాసాంధ్రులతో ముఖ్యమంత్రి సమావేశంకానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జగన్ తొలి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ టూర్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైఎస్ జగన్ కొద్దిరోజుల క్రితమే.. ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పొందారు. విజయవాడలో ఉన్న పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లిన జగన్.. పాస్పోర్ట్ తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ అమెరికా పర్యటన ఖాయమయ్యింది. వారం పాటూ కుటుంబంతో కలిసి అమెరికాలో పర్యటించబోతున్నారు. జగన్ యూఎస్ టూర్కు సంబంధించి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు ప్రవాసాంధ్రులు.
అమెరికా పర్యటనకు సీఎం జగన్
అమెరికా పర్యటనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. వారం పాటూ అమెరికాలో కుటుంబంతో కలిసి పర్యటించనున్న ముఖ్యమంత్రి. డెట్రాయిట్లో ప్రవాసాంధ్రులతో సమావేశం.
Samayam Telugu 14 Jul 2019, 10:56 pm
ప్రధానాంశాలు:
- వచ్చే నెలలో అమెరికా పర్యటనకు జగన్
- ముఖ్యమంత్రి హోదాలో తొలి విదేశీ పర్యటన
- ఇటీవలే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకున్న జగన్