యాప్నగరం

హైదరాబాద్‌‌కు సీఎం జగన్.. రేపే ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ

హైదరాబాద్ ప్రగతి భవన్‌లో శుక్రవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. రెండు రోజుల పాటూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై సీఎంల కీలక చర్చలు. గురువారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్న జగన్.

Samayam Telugu 27 Jun 2019, 7:59 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకొని.. అక్కడి నుంచి లోటస్‌పాండ్‌లోని నివాసానికి వెళ్లారు. జగన్ వెంట పలువురు ఏపీ మంత్రులు కూడా భాగ్యనగరానికి వచ్చారు. శుక్రవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రగతి భవన్‌లో సమావేశంకాబోతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై చర్చించనున్నారు. రెండు రోజుల పాటూ ఇద్దరు సీఎంలు చర్చలు జరపనున్నారు.
Samayam Telugu jagan kcr


ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రధానంగా ఆరు అంశాలపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. గోదావరిని కృష్ణా బేసిన్‌కు తరలించడం.. పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు.. 9,10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన.. విద్యుత్ బకాయిల వివాదాలు.. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన.. సొంత రాష్ట్రాలకు ఉద్యోగుల్ని తీసుకురావడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కూడా ప్రస్తావన వచ్చే అవకాశం ఉందట.

కేసీఆర్-జగన్‌లు ఇప్పటి వరకు రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ రెండు భేటీల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. అయితే కేసీఆర్ పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ఉంటామని చెప్పారు. అందుకే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు చర్చలకు సిద్ధమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.