ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్క్వార్టర్స్ భవనం(డీజీపీ ఆఫీస్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ ఆరో పటాలంలో దాదాపు ఆరెకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. సుమారు రూ.40 కోట్ల వ్యయంతో లక్షా పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయిదు ఫ్లోర్లతో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. గత ఏడాది అక్టోబరులో హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోలీసు హెడ్క్వార్టర్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. యుద్ధప్రాతిపదికన పనులను జరిపించి కేవలం పదే నెలల్లో భవన నిర్మాణాలను పూర్తిచేయడం విశేషం.
రాష్ట్ర విభజన తరవాత విజయవాడలో డీజీపీ క్యాంప్ కార్యాలయం ఏర్పాటుచేశారు. అయితే ఇక్కడ డీజీపీతో పాటు అదనపు డీజీపీ, ఐజీ స్థాయి అధికారులకు మాత్రమే చాంబర్లు ఉన్నాయి. కొంతమంది ఉన్నతాధికారులు ఇప్పటికీ హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు జరుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా నిర్మించిన డీజీపీ కార్యాలయం అందుబాటులోకి రావడంతో ఇకపై అన్ని విభాగాల అధిపతులు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. కాగా, పోలీస్ హెడ్క్వార్టర్స్ భవనం ప్రారంభోత్సవంలో హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, డీజీపీ సాంబశివరావుతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్లొన్నారు.
కాగా, భవనంలోని గ్రౌండ్ ఫ్లోరు, మొదటి అంతస్తులను సీఐడీ విభాగానికి కేటాయించారు. రెండు, మూడు అంతస్తుల్లో పీ అండ్ ఎల్, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, శిక్షణాధిపతి, శాంతి భద్రతల ఏడీజీ, టెక్నికల్ సర్వీసెస్ తదితర ప్రధాన విభాగాలకు చెందిన అధికారుల కార్యాలయాలు ఉంటాయి. నాలుగో అంతస్తులో డీజీపీ కార్యాలయం, పేషీతోపాటు కాన్ఫరెన్సు హాలు, ఎస్పీలతో మాట్లాడేందుకు సాంకేతికపరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భవన నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాల గదిలో డీజీపీ కార్యాలయం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర విభజన తరవాత విజయవాడలో డీజీపీ క్యాంప్ కార్యాలయం ఏర్పాటుచేశారు. అయితే ఇక్కడ డీజీపీతో పాటు అదనపు డీజీపీ, ఐజీ స్థాయి అధికారులకు మాత్రమే చాంబర్లు ఉన్నాయి. కొంతమంది ఉన్నతాధికారులు ఇప్పటికీ హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు జరుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా నిర్మించిన డీజీపీ కార్యాలయం అందుబాటులోకి రావడంతో ఇకపై అన్ని విభాగాల అధిపతులు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. కాగా, పోలీస్ హెడ్క్వార్టర్స్ భవనం ప్రారంభోత్సవంలో హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, డీజీపీ సాంబశివరావుతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్లొన్నారు.
కాగా, భవనంలోని గ్రౌండ్ ఫ్లోరు, మొదటి అంతస్తులను సీఐడీ విభాగానికి కేటాయించారు. రెండు, మూడు అంతస్తుల్లో పీ అండ్ ఎల్, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, శిక్షణాధిపతి, శాంతి భద్రతల ఏడీజీ, టెక్నికల్ సర్వీసెస్ తదితర ప్రధాన విభాగాలకు చెందిన అధికారుల కార్యాలయాలు ఉంటాయి. నాలుగో అంతస్తులో డీజీపీ కార్యాలయం, పేషీతోపాటు కాన్ఫరెన్సు హాలు, ఎస్పీలతో మాట్లాడేందుకు సాంకేతికపరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భవన నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాల గదిలో డీజీపీ కార్యాలయం ఏర్పాటు చేశారు.