యాప్నగరం

గంజాయి అక్రమ రవాణా.. ఎక్సైజ్ అధికారి పాత్ర!

విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని పట్టుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, వారు చెప్పిన విషయాలు విస్మయానికి గురి చేశాయి.

TNN 31 Oct 2017, 9:23 am
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి సాగు యథేచ్ఛగా కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖ పట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు పది వేల ఎకరాల్లో గంజాయిని అక్రమంగా సాగు అవుతున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ విషయంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందనే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గంజాయి సాగు, అక్రమ రవాణాను అరకట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే.. కంచె చేను మేసిన చందాన.. ఎక్సైజ్ అధికారులే అక్రమ రవాణాకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాలో విశాఖ జిల్లాకు చెందిన ఎక్సైజ్ అధికారుల పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు.
Samayam Telugu andhra pradesh excise officer involved in marijuana transportation
గంజాయి అక్రమ రవాణా.. ఎక్సైజ్ అధికారి పాత్ర!


విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని పట్టుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, వారు చెప్పిన విషయాలు విస్మయానికి గురి చేశాయి. గాజువాకలో అసిస్టెంట్ సూపరిండెంట్‌గా పని చేస్తున్న రవీంద్ర ప్రసాద్‌కు ఈ వ్యవహరంతో సంబంధం ఉందని వారు చెప్పారు. గతంలో ఆయన పాడేరులో ఇన్స్‌పెక్టర్‌గా పని చేసినప్పుడు గంజాయి దొంగలతో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది.

ఇదివరకే గంజాయి అక్రమ రవాణాలో రవీంద్ర ప్రసాద్ తలదూరుస్తున్న విషయం ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీంతో వారు పిలిచి ఆయన్ను హెచ్చరించారు. ఈ వ్యవహరంలో విశాఖకు చెందిన ఓ ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్‌తోపాటు మరో ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు సేకరించాక వీరిపై కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.