యాప్నగరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే తలమానికం: యనమల

రాష్ట్ర ప్రజలకు పాలన చేరువ చేసే లక్ష్యంతోనే హైదరాబాద్‌ నుంచి ముందుగానే అమరావతికి పాలన తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

TNN 15 Mar 2017, 11:19 am
రాష్ట్ర ప్రజలకు పాలన చేరువ చేసే లక్ష్యంతోనే హైదరాబాద్‌ నుంచి ముందుగానే అమరావతికి పాలన తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన ఏపీ రాజధాని అమరావతి వేదికగా తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదోసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థూల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. మొదటిస్థానంలో నిలిచిందని, ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
Samayam Telugu andhra pradesh finance minister yanamala presents the states budget 2017 18
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే తలమానికం: యనమల


‘ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. ఎన్నో అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం.. దేశానికే తలమానికంగా నిలుస్తోంది. విభజన వల్ల ఏర్పడిన నష్టాలను పూడ్చే విధంగా.. అనేక రంగాలకు ఊతమివ్వడం, అందరికీ ఉపాధి కలిగించేలా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం, సుపరిపాలన అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు.

విభజన తర్వాత ఎన్నో సవాళ్లు తట్టుకుని గొప్ప పరిణతి తీసుకురాగలిగామని, రెండున్నరేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని ఆర్థికమంత్రి అన్నారు. రైతుల నుంచి అమరావతి కోసం వేలాది ఎకరాలను సేకరించామని, 192 రోజుల అతి తక్కువ కాలంలోనే అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించుకోగలిగామని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం దేశానికే ఆదర్శంగా చేపడతామని ఆయన అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఏడాది కాలంలోనే పూర్తి చేసుకోగలిగామని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.