యాప్నగరం

తల్లిదండ్రుల ముందు అవార్డులెంత: కె. విశ్వనాథ్

తన జీవితంలో అవార్డులు శాశ్వతం కాదని, తల్లిదండ్రులు ఉంగరం పట్టి రాయించనదే తనకు శాశ్వతమని ప్రముఖ దర్శకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె. విశ్వనాథ్ అన్నారు.

TNN 12 Jul 2017, 8:53 am
తన జీవితంలో అవార్డులు శాశ్వతం కాదని, తల్లిదండ్రులు ఉంగరం పట్టి రాయించనదే తనకు శాశ్వతమని ప్రముఖ దర్శకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె. విశ్వనాథ్ అన్నారు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడమే కాకుండా, భారతీయ సినిమాకు కె. విశ్వనాథ్ చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్‌ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆయన్ని ఘనంగా సత్కరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి కళాతపస్విని సన్మానించారు.
Samayam Telugu andhra pradesh government fecilitated kalathapaswi k viswanath
తల్లిదండ్రుల ముందు అవార్డులెంత: కె. విశ్వనాథ్


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘కొంత మందికి భగవంతుడు కొన్ని కళలను పుట్టుకతోనే ఇస్తాడు. ఆదే భవిష్యత్‌లో జాతి సంపద అవుతుంది. ఇలాంటి జాతి సంపద మన కాశీనాథుని విశ్వనాథ్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా గర్వించదగిన బిడ్డ. ఈ సన్మానం ఆయనకు చేస్తున్నది కాదు.. తెలుగు జాతికి చేన్నదిగా భావిస్తున్నాను. తాను ఎంచుకున్న రంగాన్ని నమ్ముకుని, కష్టపడి పని చేస్తే చరిత్ర సృష్టింవచ్చని విశ్వనాథ్‌ నిరూపించారు. ఆయన్ను సత్కరించడం నా పూర్వ జన్మసుకృతం’ అని అన్నారు.

కె. విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ‘నేను ఆ రోజు అవార్డు తీసుకున్నప్పుడు ఏం మాట్లాడానో... ఇప్పుడు కూడా అదే మాట్లాడతాను. నా జీవితంలో అవార్డులు శాశ్వతం కాదు. తల్లిదండ్రులు ఉంగరం పట్టి రాయించినదే నాకు శాశ్వతం. దేవుడు నాకు ఆయుధం ఇచ్చాడు కాబట్టి నా డ్యూటీ నేను చేశాను. ఆలికి అన్నం పెట్టినంత మాత్రాన ఊరికి ఉపకారం చేసినట్లు కాదు. నా కర్తవ్యం నేను నెరవేర్చానంతే’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ను సీఎం చంద్రబాబు శాలువాతో పాటు గజమాలతో సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.