యాప్నగరం

ఓహో.. రోజా పదవి ఆలస్యం వెనుక కారణం ఇదేనా!

రోజాకు పదవి దక్కినా అలిగారంటూ ప్రచారం జరిగింది. అందుకే ఆమె ఏపీఐఐసీ పదవి బాధ్యతలు స్వీకరించలేదని చర్చ నడిచింది. ఆమె పదవి ఆలస్యం కావడం వెనుక అసలు కారణం తెలిసిపోయింది.

Samayam Telugu 11 Jul 2019, 10:12 pm
నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పదవి అయితే దక్కింది కానీ.. ఆమె మాత్రం బాధ్యతలు స్వీకరించలేదు. రోజా అలకబూనారా అంటూ ప్రచారం కూడా జరిగింది. అమరావతికి రావడం మానేశారట.. సొంత నియోజకవర్గానికి మొన్నటి వరకు దూరంగా ఉన్నారు. కేవలం హైదరాబాద్‌‌కే పరిమితమయ్యారనే చర్చ నడిచింది. అయితే రోజా పదవి ఆలస్యం వెనుక అసలు కారణమేంటో తెలిసింది.
Samayam Telugu roja


రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించిన విషయం వాస్తవమే. కానీ అధికారికంగా ఉత్తర్వులు మాత్రం రాలేదు. కొన్ని కారణాలతో.. ఉత్తర్వులు రావడం ఆలస్యమయ్యిందట. అందుకే రోజా కూడా బాధ్యతలు స్వీకరించలేదని క్లారిటీ వచ్చింది. అయితే తాజాగా రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు అఫిషియల్‌గా పదవి రావడంతో.. ఆమె త్వరలోనే బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రోజా పార్టీ తరపున వాయిస్ బాగా వినిపించారు.. టీడీపీ సర్కార్‌పై పోరాటాలూ చేశారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజిక సమీకరణాలతో రోజాకు పదవి దక్కలేదు. దీంతో ఆమె కొంత అసంతృప్తికి గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన వైసీపీ అధిష్టానం రోజాను బుజ్జగించింది. ఆ వెంటనే ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి దక్కింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.