యాప్నగరం

కరెంట్ ఛార్జీలను తగ్గించే దిశగా ఏపీ

విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టునుంది. ఇందులో భాగంగా విద్యుత్ చార్జీలను భారీగా తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

TNN 7 Aug 2017, 8:15 am
విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టునుంది. ఇందులో భాగంగా విద్యుత్ చార్జీలను భారీగా తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆదివారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గతంలో ఏప్రిల్ వచ్చిందంటే కరెంటు చార్జీలు ఎక్కడ పెరుగుతాయోనని ప్రజలు భయంగా ఎదురుచూసేవారని, కానీ వచ్చే ఏడాది నుంచి ఏ మేరకు తగ్గుతాయోనని ఆశగా ఎదురుచూసే పరిస్థితి రావాలని అన్నారు.
Samayam Telugu andhra pradesh govt may reduces electricity charges soon
కరెంట్ ఛార్జీలను తగ్గించే దిశగా ఏపీ


1998లో తాను సీఎంగా ఉన్న సమయంలో ప్రారంభించిన తొలి దశ విద్యుత్ సంస్కరణల ఫలాలను ప్రజలు ప్రస్తుతం అందుకుంటున్నారని అన్నారు. నాటి సంస్కరణల వల్లే నేడు మిగులు విద్యుత్ సాధించే స్థాయికి చేరుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యయ నియంత్రణ విధానాలను అమలు చేయడం ద్వారా ఏటా రూ.2వేల కోట్ల మేర పొదుపు చేసుకోవచ్చని వివరించారు. తమ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న చంద్రబాబు రాష్ట్రంలో మెగా విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.