జగన్ సర్కారు పెట్టుబడుల వేట.. ఆగష్టు 9 రాష్ట్రానికెంతో కీలకం!
ఏపీ సర్కారు పెట్టుబడులు ఆకర్షణకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విదేశాంగ శాఖ సహకారంతో ఆగష్టు 9న బెజవాడలో భారీ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో 30 దేశాలకుపైగా ప్రతినిధులు పాల్గొంటారు.
Samayam Telugu 27 Jul 2019, 11:19 pm
అమరావతి: పెట్టుబడుల ఆకర్షణకు ఏపీ సర్కారు గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. భారత విదేశాంగశాఖ సమన్వయంతో ఆగస్టు 9న విజయవాడలో భారీ సదస్సు నిర్వహించనుంది. వివిధ దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కనీసం 30 నుంచి 40 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్ జనరల్స్ హాజరు కానున్నారు.
పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల ద్వారా 4.01 లక్షలకు పైగా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలను కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి పెండింగ్లో పెట్టిన వివిధ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే రాష్ట్రంలో పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ ప్రయత్నాలు ఒకవైపు చేస్తూనే మరోవైపు మరిన్ని పెట్టుబడులు తీసుకురావడం ద్వారా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నడుం బిగించింది. దీంట్లో భాగంగానే రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్ జనరల్స్తో ఈ భారీ సదస్సుని నిర్వహిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆగస్టు 9న నిర్వహించబోయే ఈ సదస్సులో మొదట ఆయా దేశాల రాయబారులు, కాన్సులేట్ జనరళ్లతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ముఖాముఖి చర్చలు కూడా జరుపుతారు. ఏ రాష్ట్రమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు, ప్రభుత్వ విధానాలు, పారదర్శక పాలన, అవినీతి రహిత, నిజాయితీతో కూడిన వ్యవస్థలు, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, చౌకగా నాణ్యతతో కూడిన విద్యుత్.. మొదలైనవి అవసరం అని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. దీంట్లో భాగంగానే ఇటీవల వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంది.
ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు పారిశ్రామిక రంగానికి ఏవిధంగా ఉపయోగ పడనున్నాయో ముఖ్యమంత్రి ఈ సదస్సులో వివరిస్తారు. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల పెంపు, తద్వారా రాష్ట్రంలో ఉత్తమ సమాజ నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలను ఆయన విశదీకరిస్తారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో చేపడుతున్న అనేక కార్యక్రమాలను వారికి తెలియజేస్తారు. లంచాల్లేని వ్యవస్థలు, అవినీతిలేని పాలన, పారదర్శక విధానాలకోసం తీసుకొచ్చిన ముందస్తు న్యాయసమీక్ష ద్వారా ఏవిధంగా ప్రభుత్వం స్వచ్ఛమైన పరిపాలనకు కట్టుబడి ఉందో తెలియజేస్తారు.
పరిశ్రమలకు సానుకూలంగా తీసుకున్న నిర్ణయాలను కూడా రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్ జనరళ్లకు ప్రభుత్వం వివరించనుంది. రాష్ట్రంలో వివిధ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా నాణ్యమైన మానవ వనరులను అందుబాటులోకి తీసుకు రానున్న అంశాన్నికూడా ఈ సదస్సులో వివరించనుంది. విద్యుత్ శాఖలో తీసుకొస్తున్న పలు సంస్కరణలు కారణంగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యుత్ను తీసుకొస్తామని వారికి వివరిస్తుంది. రాష్ట్రంలో ఉన్న వనరులు, తీరప్రాంతం, రవాణా, సర్వీసు, వైద్యం, సాంకేతిక రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను కూడా వారికి వివరిస్తుంది.
కియా కొత్త కారుకు సన్నాహాలు, సీఎం జగన్కు ఆహ్వానం:
దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ తన కొత్త కారును ఆగస్టు 8 నుంచి విడుదలకు సన్నాహాలు చేస్తోంది. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో తన కొత్తకారును మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈకార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ను కియా కంపెనీ కోరింది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమైన కియా కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి పర్యటనపై చర్చించారు.
పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల ద్వారా 4.01 లక్షలకు పైగా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలను కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి పెండింగ్లో పెట్టిన వివిధ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే రాష్ట్రంలో పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ ప్రయత్నాలు ఒకవైపు చేస్తూనే మరోవైపు మరిన్ని పెట్టుబడులు తీసుకురావడం ద్వారా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నడుం బిగించింది. దీంట్లో భాగంగానే రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్ జనరల్స్తో ఈ భారీ సదస్సుని నిర్వహిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆగస్టు 9న నిర్వహించబోయే ఈ సదస్సులో మొదట ఆయా దేశాల రాయబారులు, కాన్సులేట్ జనరళ్లతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ముఖాముఖి చర్చలు కూడా జరుపుతారు. ఏ రాష్ట్రమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు, ప్రభుత్వ విధానాలు, పారదర్శక పాలన, అవినీతి రహిత, నిజాయితీతో కూడిన వ్యవస్థలు, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, చౌకగా నాణ్యతతో కూడిన విద్యుత్.. మొదలైనవి అవసరం అని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. దీంట్లో భాగంగానే ఇటీవల వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంది.
ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు పారిశ్రామిక రంగానికి ఏవిధంగా ఉపయోగ పడనున్నాయో ముఖ్యమంత్రి ఈ సదస్సులో వివరిస్తారు. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల పెంపు, తద్వారా రాష్ట్రంలో ఉత్తమ సమాజ నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలను ఆయన విశదీకరిస్తారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో చేపడుతున్న అనేక కార్యక్రమాలను వారికి తెలియజేస్తారు. లంచాల్లేని వ్యవస్థలు, అవినీతిలేని పాలన, పారదర్శక విధానాలకోసం తీసుకొచ్చిన ముందస్తు న్యాయసమీక్ష ద్వారా ఏవిధంగా ప్రభుత్వం స్వచ్ఛమైన పరిపాలనకు కట్టుబడి ఉందో తెలియజేస్తారు.
పరిశ్రమలకు సానుకూలంగా తీసుకున్న నిర్ణయాలను కూడా రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్ జనరళ్లకు ప్రభుత్వం వివరించనుంది. రాష్ట్రంలో వివిధ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా నాణ్యమైన మానవ వనరులను అందుబాటులోకి తీసుకు రానున్న అంశాన్నికూడా ఈ సదస్సులో వివరించనుంది. విద్యుత్ శాఖలో తీసుకొస్తున్న పలు సంస్కరణలు కారణంగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యుత్ను తీసుకొస్తామని వారికి వివరిస్తుంది. రాష్ట్రంలో ఉన్న వనరులు, తీరప్రాంతం, రవాణా, సర్వీసు, వైద్యం, సాంకేతిక రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను కూడా వారికి వివరిస్తుంది.
కియా కొత్త కారుకు సన్నాహాలు, సీఎం జగన్కు ఆహ్వానం:
దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ తన కొత్త కారును ఆగస్టు 8 నుంచి విడుదలకు సన్నాహాలు చేస్తోంది. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో తన కొత్తకారును మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈకార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ను కియా కంపెనీ కోరింది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమైన కియా కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి పర్యటనపై చర్చించారు.