యాప్నగరం

నిశిత్ మరణం: నగరానికి చేరుకుంటున్న టీడీపీ మంత్రులు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కొడుకు నిశిత్ మరణం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది.

TNN 10 May 2017, 9:46 am
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కొడుకు నిశిత్ మరణం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. టీడీపీ నేతలంతా తమ పర్యటనలు రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకుంటున్నారు. మంత్రి నారాయణ కొడుకు మరణ వార్త తెలియగానే తీవ్ర విషాదంలో మునిగిపోయారు. లండన్ నుంచి బయలుదేరారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు ఆయన ఎక్కిన విమానం చెన్నై చేరుకుంటుంది. అక్కణ్నించి ఆయన నేరుగా నెల్లూరు చేరుకుంటారు. నిశిత్ మృతదేహాన్ని కాసేపట్లో నెల్లూరు తీసుకెళ్లబోతున్నారు కుటుంబసభ్యులు. ఏపీసీఎం చంద్రబాబు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. నిశిత్ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే మంత్రి నారాయణతో మాట్లాడినట్టు సమాచారం.
Samayam Telugu andhra pradesh ministers son dies in hyderabad shock to tdp
నిశిత్ మరణం: నగరానికి చేరుకుంటున్న టీడీపీ మంత్రులు


ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్ తన పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు. అలాగే మంత్రి నారాయణ వియ్యంకుడు, మరో మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. మంత్రి సోమిరెడ్డి నెల్లూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఇప్పటికే అపోలో ఆసుపత్రికి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప నిశిత్ భౌతిక కాయం వద్దే ఉన్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా అపోలో ఆసుపత్రికి వెళ్లారు. నిశిత్ తల్లి ఆసుపత్రిలోనే ఓ చోట కుప్పకూలిపోయారు. చేతికందిన ఒక్కగానొక్క కొడుకు ఇలా దూరమవ్వడంతో ఆ తల్లిని తీవ్ర విషాదంలో ముంచేసింది. నారాయణ దంపతకులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. చిన్న కూతురిని మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకుకి ఇచ్చి పెళ్లి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.