యాప్నగరం

ఏపీ పోలీసుల కంప్యూటర్లపై సైబర్ ఎటాక్

ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖకి చెందిన కంప్యూటర్స్ సైబర్ ఎటాక్‌కి గురయ్యాయి.

Samayam Telugu 13 May 2017, 12:53 pm
ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖకి చెందిన కంప్యూటర్స్ సైబర్ ఎటాక్‌కి గురయ్యాయి. రాష్ట్రంలోని 25% పోలీసు స్టేషన్లలో కంప్యూటర్స్ హ్యాకింగ్‌కి గురయినట్టుగా రాష్ట డీజీపీ సాంబశివ రావు తెలిపారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత కంప్యూటర్లే హ్యాకింగ్‌కి గురయ్యాయని చెప్పిన డీజీపీ.. తన కంప్యూటర్‌లో ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ వున్నందున హ్యాకింగ్ బారిన పడలేదని అన్నారు. సైబర్ ఎక్స్‌పర్ట్స్ తిరిగి సమాచార వ్యవస్థని గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారని డీజీపి పేర్కొన్నారు.
Samayam Telugu andhra pradesh police department computers hacked
ఏపీ పోలీసుల కంప్యూటర్లపై సైబర్ ఎటాక్


దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొని వున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో హెల్త్ కేర్, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు సైబర్ దాడుల బారిన పడటంతో ఆయా రంగాల్లో సేవలు పూర్తిగా స్థంభించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.