యాప్నగరం

చంద్రబాబుకు రూ.పదివేల కోట్లు కావాలిట

తెలంగాణపై నగదు రద్దు ప్రభావాన్ని ప్రధానికి వివరించేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లగా, తమకు రూ.10 వేల కోట్లు కావాలని చంద్రబాబు అడుగుతున్నారు.

TNN 19 Nov 2016, 11:36 am
నగదు రద్దు ప్రభావం తమపై ఎలా పడిందనే విషయాన్ని ప్రధానికి వివరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లగా, తమకు రూ.10 వేల కోట్ల విలువైన చిన్న నోట్లు కావాలని ఏపీ ముఖ్యమంత్రి అడుగుతున్నారు. ఈ విషయమై చంద్రబాబు కేంద్రం, రిజర్వ్ బ్యాంకుకు విన్నవించుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న నగదు సంక్షోభాన్ని తీర్చడానికి ఈ మేరకు నగదును విడుదల చేయాలని బాబు కోరారు. ‘సరిపడా సొమ్మును పంపాలని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో మాట్లాడాను. అదనపు నగదు పంపేలా కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాం’ అని చంద్రబాబు విలేకరుల సమావేశంలో తెలిపారు.
Samayam Telugu andhra pradesh seeks rs 10000 crore in smaller denominations
చంద్రబాబుకు రూ.పదివేల కోట్లు కావాలిట


ఇప్పటి వరకూ రిజర్వ్ బ్యాంకు రూ.8 వేల కోట్ల విలువైన నగదును వివిధ డినామినేషన్లలో పంపిందని, రాష్ట్రానికి మరో రూ.10 వేల కోట్ల విలువైన కరెన్సీ అవసరమని చంద్రబాబు తెలిపారు. నగదు చెల్లింపుల కంటే ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు ప్రియంగా ఉండటంతో ప్రజలు ఆ దిశగా అడుగేయడం లేదన్నారు. ఆన్‌లైన్ చెల్లింపులపై ప్రస్తుతం 1.5 శాతం ఛార్జీని వసూలు చేస్తున్న బ్యాంకులు దాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఈ విషయంలో కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.