యాప్నగరం

పిడుగులను ముందే గుర్తించి హెచ్చరించారు

ఏపీ అధికారులు పిడుగుపాటును ముందే ఊహించారు.

TNN 17 May 2017, 7:38 am
అత్యాధునిక వాతావరణ సాంకేతిక పరిజ్ఞానంతో ఏపీ అధికారులు పిడుగుపాటును ముందే తెలుసుకున్నారు. పిడుగులు పడతాయని పలు గ్రామాల్లో దండోరా వేయించి... ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్తపడ్డారు. మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లాలోని కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల మధ్యలో రెండు భారీ పిడుగులు పడ్డాయి. ఆ సమయానికి గ్రామస్థులంతా తలుపులు వేసుకుని ఇళ్లల్లోనే ఉండడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. సరిగ్గా పిడుగులు పడడానికి అరగంట ముందు ఏపీ అధికారులు గ్రామాల్లో దండోరా వేయించడంతో పాటూ, ఫోన్లకు వాయిస్ మెసేజ్ లు పెట్టారు. మంగళవారం రాత్రి 9 నుంచి తొమ్మదిన్నర మధ్య పిడుగులు పడే అవకాశం ఉందని, ఎవరూ ఇళ్లల్లోంచి బయటికి రావద్దని దండోరా వేయించారు. దీంతో గ్రామస్థులంతా ఇళ్లల్లోనే ఉన్నారు. హెచ్చరించినట్టు పిడుగులు పడి... పలు టీవీలు కాలిపోయాయి.
Samayam Telugu andhra pradesh warns lightning strikes in chittoor
పిడుగులను ముందే గుర్తించి హెచ్చరించారు


పిడుగు పాటు వల్ల కలిగే మరణాలని ఆపడం కోసం ఏపీ ప్రభుత్వం ఇస్రోతో ఒప్పందం చేసుకుంది. అలాగే అమెరికాకు చెందిన ఎర్త్ నెట్ వర్క్ తో కూడ ఒప్పందం కుదుర్చుకుంది. పిడుగులను ముందే పసిగట్టే టెక్నాలజీని అందిపుచ్చుకుని రాష్ట్రంలో 15 చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎక్కడైతే పిడుగు పడే అవకాశం ఉందో అక్కడి దగ్గర్లోని సెల్ టవర్ల ద్వారా మొబైళ్లకు మేసేజ్ లు వెళతాయి. మొదటిసారి ఆ టెక్నాలజీని ఉపయోగించుకున్నారు ఏపీ ప్రజలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.