యాప్నగరం

ఇక వెళ్లు తల్లీ.. టి-ఉద్యోగుల లొల్లి...

తెలంగాణ సచివాలయంలోని ఆర్థిక శాఖలో ఉద్యోగుల మధ్య మళ్లీ విభజన లొల్లి మొదలయింది

TNN 17 Aug 2016, 9:33 pm
తెలంగాణ సచివాలయంలోని ఆర్థిక శాఖలో ఉద్యోగుల మధ్య మళ్లీ విభజన లొల్లి మొదలయింది. ఆ శాఖ ఆర్థిక కార్యదర్శి నవీన్ మిట్టల్ కు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న పద్మావతి ఆంధ్రప్రాంతానికి చెందిన వారు. ఆమె తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పట్ల వ్యవహరించే తీరును ఆక్షేపిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఉద్యోగులంటే ఆమెకు గిట్టడం లేదని చీటికి మాటికి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతీ చిన్నదానికి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఆమెను విధుల నుండి తప్పించేవరకు ఊరుకోబోమని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, పద్మావతి మాత్రం ఆంధ్ర ప్రాంతానికి తనను ఎలాగైనా పంపించాలనే ఉద్దేశంతోనే టి. ఉద్యోగులు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను నిబంధనల ప్రకారమే తెలంగాణలో కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.