యాప్నగరం

ఏపీ క్యాబినెట్‌లో కొత్తగా 11 మందికి చోటు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా 11 మందికి చోటు దక్కింది. వీరిలో సీనియర్లతోపాటు తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన వారు కూడా ఉన్నారు.

TNN 1 Apr 2017, 11:32 pm
ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా కొత్తగా 11 మందికి చోటు దక్కింది. వీరిలో సీనియర్లతోపాటు తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన వారు కూడా ఉన్నారు. మంత్రివర్గం కూర్పులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు సమతూకం పాటించారు. వివిధ సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యత కల్పించారు. వీరిలో చిత్తూరు జిల్లా నుంచి నారా లోకేశ్‌, ​ అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాకుళం జిల్లా నుంచి కిమిడి కళా వెంకట్రావు, విజయనగరం జిల్లా నుంచి సుజయ్‌కృష్ణ రంగారావు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి జవహర్‌, పితాని సత్యన్నారాయణ. గుంటూరు జిల్లా నుంచి నక్కా ఆనంద్‌బాబు, నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కడప జిల్లా నుంచి ఆదినారాయణరెడ్డి, అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు, కర్నూలు నుంచి భూమా అఖిల ప్రియకు అవకాశం దక్కింది.
Samayam Telugu andhrapradesh cbinet expansion in 2017
ఏపీ క్యాబినెట్‌లో కొత్తగా 11 మందికి చోటు


ఈ 11 మందిలో నారా లోకేశ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన భూమా అఖిలప్రియ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కొత్త మంత్రులు వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న అయిదుగురికి ఉద్వాసన పలికారు. వారిలో ఐటీ అండ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఉద్వాసన పలికినవారిలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.