యాప్నగరం

తాగుబోతు భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య!

రోజూ కూలి పనికి వెళ్తేనే ఆ కుటుంబ పోషణ గడుస్తుంది. కానీ కూలి డబ్బులతో మద్యం సేవిస్తూ భర్త ఇంట్లో గొడవకు దిగుతున్నాడు.

TNN 24 Oct 2017, 3:44 pm
రోజూ కూలి పనికి వెళ్తేనే ఆ కుటుంబ పోషణ గడుస్తుంది. కానీ కూలి డబ్బులతో మద్యం సేవిస్తూ భర్త ఇంట్లో గొడవకు దిగుతున్నాడు. తాగుబోతు భర్త ఆగడాలను భరించలేక ఓ ఇల్లాలు క్షణికావేశంలో అతడి మర్మాంగాన్ని కోసేసింది. అయితే అదృష్టవశాత్తు అతని ప్రాణానికి ఎలాంటి హాని జరగలేదు. ఈ మేరకు భర్త ఫిర్యాదు చేయడంతో భార్యపై కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట పోలీసులు కేసు నమోదుచేశారు. ఇల్లందకుంట ఎస్సై నరేష్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu angry wife attacks husband and cuts private parts with a knife
తాగుబోతు భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య!


ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన భార్యాభర్తలు రౌతు రవీందర్‌, స్వరూపలు దినసరి కూలీలు. ఇద్దరి కూలి డబ్బులను తీసుకెళ్లి రవీందర్ రోజూ మద్యం సేవిస్తున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో వీరిద్దరూ కలసి పనిచేసిన కూలి డబ్బులు ఓ రైతు వద్ద ఉండగా ఆదివారం సాయంత్రం రవీందర్ ఆ డబ్బులు తీసుకుని మద్యం సేవించాడు. దీనిపై సోమవారం ఉదయం భార్యభర్తలు గొడవ పడ్డారు. దీంతో క్షణికావేశానికి గురైన స్వరూప.. డబ్బులన్నీ మందుకు పోస్తావా అని ఇంట్లోని కూరగాయలు కోసే కత్తితో మర్మాంగాన్ని కోసేసింది.

దీన్ని గమనించిన స్థానికులు రక్తస్రావం అవుతున్న రవీందర్‌ను జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.