యాప్నగరం

ఏపీ కొత్త సీఎస్‌గా అనిల్‌చంద్ర పునేఠ

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠ.. ప్రస్తుత సీఎస్‌ దినేష్ కుమార్ పదవీకాలం ఈ నెల 30న ముగుస్తుండటంతో.. పునేఠ ఎంపిక..

Samayam Telugu 28 Sep 2018, 9:44 pm
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న దినేష్ కుమార్ పదవీకాలం ఈ నెల 30న ముగుస్తుండటంతో.. పునేఠను ఎంపిక చేశారు. ఈయన ఏడాది పాటూ సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. అమరావతిలో పునేఠ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Samayam Telugu CS


అనిల్ చంద్ర పునేఠ 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తొలుత రాజంపేట సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా.. ఉద్యాన, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన సీసీఎల్‌ఏ (భూపరిపాలన శాఖ) ప్రధాన కమిషనర్‌గా పని చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.