యాప్నగరం

గోదావరిలో లాంచీ మునక: 35 మంది గల్లంతు?

కొద్ది రోజుల కిందట గోదావరిలో లాంచీ అగ్ని ప్రమాదానికి గురైన ఘటన మరవక ముందే.. మరో ఘోర ప్రమాదం మంగళవారం చోటు చేసుకుంది.

Samayam Telugu 15 May 2018, 8:13 pm
కొద్ది రోజుల కిందట గోదావరిలో లాంచీ అగ్ని ప్రమాదానికి గురైన ఘటన మరవక ముందే.. మరో ఘోర ప్రమాదం మంగళవారం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నంలోని మంటూరు వద్ద లాంచి బోల్తా పడి సుమారు 35 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు తెలిసింది. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Samayam Telugu adsaaa


ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ లాంచిలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. లాంచీ గోదావరిలో ప్రయాణిస్తున్న సమయంలో సుడిగాలులు వీయడంతో లాంచీ తలుపులు మూసివేశారని, దీంతో లాంచీ అక్కడిక్కడే మునిగిపోయింది. సుమారు 5 మంది ప్రయాణికలు ఒడ్డుకు ఈదుకుని వచ్చినట్లు స్థానికుల సమాచారం. ప్రమాద వార్త తెలియగానే అధికారులు అక్కడికి చేరుకుని గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపులు మొదలుపెట్టారు. ఇటీవల లాంచీ అగ్ని ప్రమాదానికి గురైన ప్రాంతంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.