యాప్నగరం

జగన్ పాదయాత్ర..ఆయనకు టీడీపీ కండువా!

ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతుండగా..

TNN 1 Jan 2018, 12:52 pm
ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతుండగా.. ఆ జిల్లాలోని ఒక వైకాపా నేతకు పచ్చకండువా వేస్తోంది తెలుగుదేశం పార్టీకి. జగన్ పాదయాత్ర చిత్తూరులో సాగుతున్న తరుణంలోనే ఆయన పార్టీ నుంచి ఎవరో ఒకరిని చేర్చుకుంటే.. దెబ్బ కొట్టినట్టు అవుతుందనే లెక్కతో వైకాపా కుప్పం నియోజకవర్గం నేత సుబ్రమణ్యం రెడ్డికి టీడీపీ సభ్యత్వం ఇస్తోంది.
Samayam Telugu another leader to join tdp from ysrcp
జగన్ పాదయాత్ర..ఆయనకు టీడీపీ కండువా!


గత మూడు పర్యాయాలుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పోటీ చేశారు సుబ్రమణ్యం రెడ్డి. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి...అనంతరం వైకాపా తరఫు నుంచి ఈయన బాబుపై పోటీ చేశారు. అయితే ఏనాడూ తెలుగుదేశం అధినేతకు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. కానీ.. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈయనను చేర్చేసుకొంటూ ఉండటం గమనార్హం.

వైకాపా నుంచి వచ్చే వాళ్లకు తెలుగుదేశం పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు, ద్వితీయ శ్రేణి నేతలకు కూడా తెలుగుదేశం స్వాగతం పలుకుతోంది. చిత్తూరు జిల్లాలోనే కొంతమంది ఎమ్మెల్యేలు వైకాపాను వీడి టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు కుప్పం నియోజకవర్గం ఇన్ చార్జి చేరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.