యాప్నగరం

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ? నిజమెంత?

ఎన్నికలు సమీపిస్తోన్న తరుణాన ఏపీలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుందా...? ఇంతకూ ఎవరిదా పార్టీ? ఏ వర్గం లక్ష్యంతో ఏర్పాటు కాబోతోంది?

Samayam Telugu 28 Mar 2018, 6:45 pm
ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండగానే ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ.. ఈసారి ప్రత్యర్థులుగా తలపడనున్నాయి. మరోవైపు కమ్యూనిస్టులతో కలిసి జనసేన రంగంలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే కసితో ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయనుంది. అంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో బహుముఖ పోటీ తప్పదన్నమాట. ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్తగా మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతుందనే వార్తలు ఆసక్తికరంగా మారాయి.
Samayam Telugu ఆంధ్రప్రదేశ్


ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు. త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన బీజేపీ, టీడీపీ, జనసేనల్లో ఏదో ఒక పార్టీలో చేరతారంటూ మీడియా ఊదరగొడుతోంది. నిజాయతీ గల అధికారి అయిన ఆయన మా పార్టీలో చేరతానంటే అభ్యంతరం లేదని పవన్ కల్యాణ్ చెప్పారు కూడా. మిగతా రెండు పార్టీలదీ అదే తీరు.

కానీ ఏ పార్టీలోనూ చేరేందుకు జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. తానే సొంతపార్టీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఐపీఎస్ అధికారిగా పాలనానుభవంతోపాటు మచ్చలేని వ్యక్తిత్వం ఆయన సొంతం. దీంతో కాపు ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొని, మిగతా వర్గాలను ఆకర్షించగలిగితే.. వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారొచ్చని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కానీ పార్టీ మనుగడకు ఆర్థిక బలం ఎంతో అవసరం. మరి లక్ష్మీనారాయణ పార్టీ ఏర్పాటు చేస్తే.. ఆర్థికవనరులు ఎలా ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మరి కొద్ది రోజులు ఆగితే.. ఆయన రాజకీయ నిర్ణయం ఏంటో తెలుస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.