యాప్నగరం

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న... జెరూసలేం మత్తయ్య... పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. తాను అప్రూవర్‌గా మారతానంటూ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. కొందరు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని... కేసుకు సంబంధించి తన వాదనను వినాలని లేఖలో ప్రస్తావించారు.

TNN 23 Feb 2018, 10:00 pm
ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న... జెరూసలేం మత్తయ్య... పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. తాను అప్రూవర్‌గా మారతానంటూ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. కొందరు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని... కేసుకు సంబంధించి తన వాదనను వినాలని లేఖలో ప్రస్తావించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాపాడాలన్నారు మత్తయ్య. టీడీపీ, టీఆర్‌ఎస్‌లు తనను ఇబ్బంది పెడుతున్నాయని మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తనను ఉపయోగించుకొని చంద్రబాబును ఇరికించాలనే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు.
Samayam Telugu another twist in vote for cash case a4 accused mathaiah jerusalem turns approver
ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్


క్రిస్టియన్ల సమస్యలపై మాట్లాడటానికే ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ని కలిశానని మత్తయ్య అన్నారు. కేసు హైకోర్టులో ఉన్న సమయంలో తనకు టీడీపీ సహకరించిందని... సుప్రీంకోర్టులో మాత్రం ఎవరూ సాయం చేయడం లేదన్నారు. తనకు కనీసం సమాచారం కూడా లేదని... తర్వాత కేటీఆర్‌కి ఫోన్ చేసిన సమయంలో ఆయన్ను ఇరికించడానికి ఏపీ ప్రభుత్వం చూసిందని ఆరోపించారు. సీఎం ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కొన్ని వాస్తవాలు తెలియాలన్నారు. మత్తయ్య లేఖతో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. మత్తయ్య అప్రూవర్‌గా మారితే పరిస్థితి ఎలా ఉండబోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన ఎవరెవరి పేర్లు బయటపెడతారోననే ఆసక్తి మొదలయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.