విశాఖలో మరో ప్రపంచ స్థాయి సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు, మారీటైం సదస్సులు విజయవంతమైన నేపథ్యంలో ఈ సారి బ్రిక్స్ సదస్సు కూడా విశాఖలో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సెప్టెంబర్ 14న ముహూర్తం ఖరారైంది. బుధవారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ టక్కర్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సదస్సుకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ శాఖ కార్యదర్శులు హాజరై సదస్సు నిర్వహణ.. చర్చించాల్సిన అంశాలపై తమ సూచనలు ఇచ్చారు. అనంతరం సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ టక్కర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణీకరణ ప్రధానంగా అంశంగా జరిగే ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి దాదాపు 500 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశముందని టక్కర్ వెల్లడించారు.
విశాఖలో మరో ప్రపంచ స్థాయి సదస్సు..
ప్రభుత్వ చీఫ్ సెక్కట్రరీ టక్కర్ బ్రిక్స్ సదస్సు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
TNN 13 Jul 2016, 4:42 pm