యాప్నగరం

బీజేపీయేతర కూటమి ప్రయత్నాలు.. నేడు బెంగళూరుకు చంద్రబాబు

బీజేపీయేతర పార్టీల కూటమి ప్రయత్నాలు ముమ్మరం.. నేడు బెంగళూరుకు టీడీపీ అధినేత చంద్రబాబు.. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమార స్వామిలతో భేటీ.. కూటమి ఏర్పాటు, తాజా రాజకీయాలపై చర్చించనున్న నేతలు.

Samayam Telugu 8 Nov 2018, 9:21 am
బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాహుల్ గాంధీ సహా జాతీయ స్థాయి నేతల్ని కలిసిన బాబు.. ఇప్పుడు దక్షిణాది ప్రాంతీయ పార్టీల మద్దతుపై కూడా ఫోకస్ పెట్టారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా గురువారం చంద్రబాబు బెంగళూరు వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామిలను కలవబోతున్నారు.
Samayam Telugu babu


మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు బెంగళూరు బయల్దేరతారు. అక్కడ దేవెగౌడ, కుమార స్వామిలతో భేటీ అవుతారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించడంపై అభినందనలు తెలపనున్నారు. అలాగే బీజేపీయేతర పార్టీల కూటమి, తాజా రాజకీయాలపై జేడీఎస్ నేతలతో చర్చిస్తారు. ఇటు శుక్రవారం చంద్రబాబు చెన్నై వెళ్లనున్నారు. ఈ పర్యటనలో డీఎంకే నేత స్టాలిన్‌తో భేటీకాబోతున్నారు. బీజేపీయేతర పార్టీల కూటమి కూర్పుపై చర్చించనున్నారు.

బీజేపీయేతర పార్టీల కూటమి కోసం చంద్రబాబ ఇప్పటికే చంద్రబాబు రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. హ‌స్తిన‌ పర్యటనలో భాగంగా చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాయావతి, శ‌ర‌ద్‌ప‌వార్‌, శ‌ర‌ద్ యాద‌వ్‌,ములాయం, అఖిలేష్‌, ఫ‌రూఖ్ అబ్దుల్లా, వామ‌ప‌క్ష పార్టీల అగ్రనేత‌లతో వరుస భేటీలు నిర్వహించి అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. త్వరలోనే మరికొందరు నేతల్ని కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. అంతేకాదు ధర్మపోరాట ముగింపు సభకు జాతీయ స్థాయి నేతల్ని ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.