యాప్నగరం

తెలుగు రాష్ట్రాల గవర్నర్ తేనీటి విందు

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం తేనీటి విందును ఏర్పాటు చేశారు.

TNN 26 Jan 2017, 7:42 pm
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం తేనీటి విందును ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలను, మంత్రులను, ఉన్నతాధికారులను ఆహ్వానించి ‘ఎట్ హోం’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు విచ్చేశారు. వచ్చిన అతిధులందరినీ గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. విందుప్రారంభమవ్వడానికి ముందు జాతీయ గీతాన్ని వినిపించగా, అందరూ లేచి నిల్చున్నారు. అనంతరం విందు మొదలైంది. తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, ఆర్ బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ కూడా ఈ విందుకు విచ్చేశారు. తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, లక్ష్మారెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి, ప్రతిపక్ష నేత జానా రెడ్డి కూడా హాజరయ్యారు. అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వచ్చారు.
Samayam Telugu ap and telangana cms attend governor narasimhan at home party
తెలుగు రాష్ట్రాల గవర్నర్ తేనీటి విందు


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.