యాప్నగరం

వచ్చే ఏడాది 15 శాతం వృధ్ధి రేటు సాధిస్తాం - గవర్నర్

ఆంధ్రప్రదేశ్ అసంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభయ్యాయి.

TNN 5 Mar 2016, 3:46 pm
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా తమ నిరసనను తెలియజేసేందుకు వైసీపీ సభ్యులు నల్ల కండువా కప్పుకొని వచ్చారు. ఇదిలా ఉండగా సభ ప్రారంభంకాగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది ప్రకృతి విపత్తులతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయినప్పటికీ రెండంక్కెల వృద్ది రేటు కోసం ప్రయత్నించామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ది రేటు సాధిస్తామన్నారు. కాపు రిజర్వేష్ల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని.. చరిత్రలో తొలిసారిగా కాపు రిజర్వేషన్ కమిషన్ వేశామని గవర్నర్ నరసింహన్ వెల్లడించారు.
Samayam Telugu ap assembly budget session 2016 sarts
వచ్చే ఏడాది 15 శాతం వృధ్ధి రేటు సాధిస్తాం - గవర్నర్


కరువు రహితంగా తీర్చిదిద్దుతాం ...
ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతామని.. ఇప్పటికే ఈ దశగా చర్యలు ప్రారంభించినట్లు గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. పట్టిసీమ ద్వార కృష్టా డెల్లాకు నీరందిస్తున్నారు. కృష్ణా - పెన్నా నదులను కూడా అనుసంధిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. మత్స్య సందప ఉత్సత్తిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. లోటు బడ్జెట్ నిధుల్లో మనకు అందించింది ఇప్పటి వరకు రూ. 2 వేల 300 కోట్లు మాత్రమేనని.. మరిన్ని నిధులు కేంద్రం నుంచి రాబట్టాల్సి ఉందన్నారు. అలాగే విభజన చట్టంలోని హామీల అమలు చేయాలని మరోసారి కేంద్రాన్ని కోరుతామన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వార పెన్షన్లు అందిస్తున్నామన్నారు. హాస్టళ్ల ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. మహిళా భద్రత కోసం మరిన్న చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ నరసింహన్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.