యాప్నగరం

రెయిన్ ఎఫెక్ట్: ఏపీ అసెంబ్లీ.. మళ్లీ లీకేజీ..!

భారీ మొత్తాన్ని వెచ్చించి నిర్మించిన ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీ భవనం వర్షం ధాటికి తట్టుకోలేకపోయింది.

TNN 18 Jul 2017, 1:35 pm
భారీ మొత్తాన్ని వెచ్చించి నిర్మించిన ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీ భవనం వర్షం ధాటికి తట్టుకోలేకపోయింది. మరోసారి వాన నీరు కారడం, వర్షం ధాటికి ఇన్నర్ రూఫ్ ప్లేట్లు విరిగి పడటం జరిగింది. ఇది వరకూ ఒకసారి అసెంబ్లీ భవనం స్వల్ప వర్షానికే జలమయం అయ్యింది. అప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాంబర్లోకి వాన నీరు వచ్చింది. తాజాగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షం ధాటికి అసెంబ్లీ మళ్లీ జలమయం అయ్యింది. ఈ సారి మంత్రుల చాంబర్లలోకి వరదనీరు ప్రవేశించింది. చాంబర్లలోని ఇన్నర్ రూఫ్ ప్లేట్లు కూలిపోయాయి.
Samayam Telugu ap assembly building leaked again
రెయిన్ ఎఫెక్ట్: ఏపీ అసెంబ్లీ.. మళ్లీ లీకేజీ..!


జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చాంబర్లలోకి చేరిన వరద నీటిని అసెంబ్లీ సహాయక సిబ్బంది ఎత్తిపోస్తున్నారు. అలాగే ఈ చాంబర్లలో రూఫ్ ప్లేట్లు కూడా కూలిపోయాయి. ఒక వైపు చాంబర్లలో నీళ్లు చేరాయి, మరోవైపు రూఫ్ ప్లేట్లు పై నుంచి పడి పగిలిపోయాయి. దీంతో చాంబర్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. జలవనరుల శాఖ కార్యదర్శి చాంబర్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది.

కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించి నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో ఇలాంటి లీకేజీలు చోటు చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. తొలిసారి జరిగిన లీకేజ్ నిర్మాణ నాణ్యతా లోపం కాదని, సాంకేతిక కారణం చేతే జగన్ చాంబర్లోకి నీళ్లు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. అందులో కుట్ర కూడా ఉండవచ్చని అనుమానించింది. అయితే.. తాజాగా మళ్లీ అలాంటి సంఘటనే పునరావృతం కావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.