యాప్నగరం

స్పీకర్ మీద అవిశ్వాసంపై సభలో వాడీ వేడి చర్చ

స్పీకర్ పై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాటలయుద్ధం కొనసాగుతోంది.

TNN 15 Mar 2016, 2:57 pm
స్పీకర్ మీద వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ సభ్యులపై విప్ జారీ చేయడానికి 14 రోజుల గడువు ఇవ్వాలని నిబంధనల్లో ఉందన్నారు. ఈ నిబంధనలు అతిక్రమించి తన ఇష్టం వచ్చినట్లు స్పీకర్ .. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతి ఇచ్చారని జగన్ ఆరో్పించారు. స్పీకర్ అధికార పక్షానికి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో తమ పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాల్సి ఉందని.. హాజరుకానీ ఎమ్మెల్యేలకు నోటీసు ద్వారా తెలియజేయాల్సి ఉన్న తరుణంలో.. తమను సంప్రదించకుండా ఆకస్మాత్తుగా అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతి ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. అధికారపక్షం వైపు కొమ్ముకాస్తూ ఏకపక్షంగా వ్యవహరించబట్టే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు జగన్ అన్నారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న ఆర్థిక మంత్రి యనమల.. చర్చ ఎప్పుడు చేపట్టాలనే దానిపై సభ నిర్ణయిస్తుందని.. ఆ అధికారం స్పీకర్ కు ఉందనే విషయం ప్రతిపక్ష నేతకు తెలియనట్లుగా ఉందని మంత్రి యనమల వ్యంగ్యాశ్ర్తాలు సంధించారు.
Samayam Telugu ap assembly discussion on no confidence motion on speaker
స్పీకర్ మీద అవిశ్వాసంపై సభలో వాడీ వేడి చర్చ


స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం ఉదయం వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై చర్చకు డిప్యూటీ స్పీకర్ అనుమతి ఇవ్వడంతో సభలో చర్చ మొదలైంది. ఈ సందర్భంగా తొలుత వైసీపీ సభ్యుడు కొటంరెడ్డి శ్రీథర్ రెడ్డి మాట్లాడారు. అనంతరం అధికార, ప్రతిపక్షానికి చెందిన కొందరు ఎమ్మెల్యేల్యు ఈ అంశంపై స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.