ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం మొదలవ్వగానే వైకాపా సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన వేటినీ ప్రభుత్వం అమలు పరచడం లేదని విమర్శించారు. ఒక్క ఉద్యోగ ప్రకటన ఇవ్వలేదని ప్రశ్నించారు. అంతకుముందు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందిగా నోటీసు ఇచ్చింది. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు.
ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైకాపా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
TNN 10 Mar 2016, 9:46 am