యాప్నగరం

అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఓకే

ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి.

TNN 14 Mar 2016, 11:14 am
ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా ప్రభుత్వంపై కొన్ని రోజుల క్రితం వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆ నోటీసును పరిగణనలోోకి తీసుకుంటున్నట్టు... త్వరలో చర్చించనున్నట్టు స్పీకర్ శివప్రసాదరావు సభలో ప్రకటించారు. బీఏసీలో కూడా ఈ విషయంపై చర్చ ఉంటుందని ఆయన తెలిపారు. అయితే అవిశ్వాస తీర్మానంపై ఎప్పుడు చర్చించాలి, ఎంత సమయం చర్చించాలి అన్నవి బీఏసీ సమావేశంలో చర్చిస్తారు. నిబంధన ప్రకారమైతే నోటీసు ఇచ్చిన 14 రోజుల్లో చర్చ జరగాలి. కాగా జీరో అవర్ తరువాత చర్చ ఉండే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.