యాప్నగరం

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

స్వరాష్ట్రంలో నూతన రాజధానిలో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

TNN 10 Mar 2017, 5:22 pm
స్వరాష్ట్రంలో నూతన రాజధానిలో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వెలగపూడిలో నిర్మించిన శాసనసభ ప్రాంగణంలో సోమవారం ఉదయం 11 నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయి. 11 గంటల 6 నిమిషాలకు గవర్నర్ నరసింహన సభనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభావ్యవహారాల సంఘం సమావేశమై సభను ఎన్నిరోజులు జరపాలో నిర్ణయిస్తుంది. దాదాపు ఆరునెలల తరువాత సభ సమావేశమవుతోంది. గతేడాది సెప్టెంబరులో వర్షాకాల సమవేశాలు హైదరాబాద్ లోని అసెంబ్లీ భవనంలో జరిగాయి. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే సమావేశాలు జరగనున్నాయి. తమ అసెంబ్లీ భవనం నిర్మాణం కొనసాగుతుండడంతో శీతాకాల సమావేశాలు కూడా నిర్వహించలేదు. ఈ నెల 13న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి అటే శాసనసభకు హాజరవ్వనున్నారు. ఇక ప్రతిపక్ష వైకాపా ప్రభుత్వాన్ని ఇరకున పెట్టే అంశాలను లేవనెత్తడానికి సన్నద్ధమవుతోంది.
Samayam Telugu ap assembly sessions starts from today in amaravati
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.